మహిళల ఆర్థిక పురోభివృద్ధికే ఆసరా
ABN , First Publish Date - 2020-09-22T08:18:15+05:30 IST
స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఆర్థిక పురోభివృద్ధికి ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.
గుడివాడ, సెప్టెంబరు 21: స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఆర్థిక పురోభివృద్ధికి ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. స్థానిక రాజేంద్రనగర్లోని మంత్రి నివాసంలో సోమవారం ఆయన్ను నందివాడ మండలం అనమనపూడికి చెందిన ‘ఆసరా’ లబ్ధిదారులు కలిశారు. గ్రామంలో నిర్వహించనున్న వేడుకలకు హాజరు కావాలని మంత్రిని కోరారు.
స్థానిక ఇందిరానగర్కు చెందిన కటికల ఆనందబాబు ఇంటర్ రెండో ఏడాది చదువుతున్న తన కుమారుడు బాబీ బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడని, ఆర్థికసాయం లేదా ఆరోగ్య శ్రీ వర్తించేలా చూడాలని కోరారు. రాయవెల్లోర్లోని క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామని మంత్రి కొడాలి నానికి వివరించారు. మంత్రి నాని వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం అధికారులతో మాట్లాడి ఇప్పటి వరకు అందించిన వైద్యం, వివరాలు తెలిపారు.
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. బాబీకి పూర్తిస్థాయిలో చికిత్స అం దించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.