కరోనా నియంత్రణకు పటిష్ఠ చర్యలు
ABN , First Publish Date - 2020-07-14T09:52:23+05:30 IST
కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటు న్నామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.
అవనిగడ్డ టౌన్, జులై 13 : కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటు న్నామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో అధికారులు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలపై ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబుతో కలిసి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని పీహెచ్సీల్లోని సమస్యలను కలెక్టర్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్లారు. దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు, ఆర్డీవో ఖాజావలి, అవనిగడ్డ పీపీ యూనిట్ వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
చల్లపల్లిలో...
చల్లపల్లి, : చల్లపల్లి పడమర వీధి కంటై న్మెంట్ ప్రాంతాన్ని సోమవారం కలెక్టర్ ఇంతియాజ్ సందర్శించారు. అన్ని పాజిటివ్ కేసులకు సంబంధించి కాంటాక్ట్లకు పరీక్షలు చేయించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి, అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ జె.అమృత, చల్లపల్లి సీఐ ఎన్.వెంకటనారాయణ ఉన్నారు.