ఓటర్ల నమోదు, సవరణలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-13T06:05:50+05:30 IST

జిల్లా వ్యాప్తంగా శని, ఆదివారాల్లో బూత్‌ స్థాయిలో ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా సవరణ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు.

ఓటర్ల నమోదు, సవరణలు ప్రారంభం
ఓటర్ల నమోదు కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఇంతియాజ్‌

ఓటర్ల నమోదు, సవరణలు ప్రారంభం

గవర్నర్‌పేట : జిల్లా వ్యాప్తంగా శని, ఆదివారాల్లో బూత్‌ స్థాయిలో ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా సవరణ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. నగరంలోని సీవీఆర్‌ వీఎంసీ స్కూల్‌, బిషప్‌ అజరయ్య స్కూల్‌, ఆంధ్ర లయోలా కళాశాల ఆవరణల్లో ఏర్పాటు చేసిన ఓటర్ల నమోదు కేంద్రాలను శనివారం ఎన్నికల పరిశీలకులు శ్రీధర్‌రెడ్డితో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జనవరి 1, 2021 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు కావాల్సి ఉందన్నారు. ఎన్నికల పరిశీలకులు శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ సవరణ కోసం వచ్చిన వారికి తగిన మార్గదర్శకాలు, సూచనలు ఇచ్చి సహకరించాలని సిబ్బందిని కోరారు. బీఎల్‌వోలు, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-12-13T06:05:50+05:30 IST