మర్యాదగా మాట్లాడండి : ఎస్పీ
ABN , First Publish Date - 2020-09-16T09:32:27+05:30 IST
బాధితులతో ఓదార్పుగా మాట్లాడితే సగం సమస్య పరిష్కారమవుతుందని ఎస్పీ ఎం. రవీంద్రనాథ్బాబు అన్నారు. మచిలీపట్నం సువర్ణ కళ్యాణ మండపంలో మంగళవారం మత సామరస్యంపై ఇష్టాగోష్టి

మచిలీపట్నం టౌన్ : బాధితులతో ఓదార్పుగా మాట్లాడితే సగం సమస్య పరిష్కారమవుతుందని ఎస్పీ ఎం. రవీంద్రనాథ్బాబు అన్నారు. మచిలీపట్నం సువర్ణ కళ్యాణ మండపంలో మంగళవారం మత సామరస్యంపై ఇష్టాగోష్టి జరిగింది. సచివాలయాల్లో పనిచేసే మహిళా పోలీసులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ అంతర్వేదిలో రథం దగ్ధం వంటి సంఘటనలు జిల్లాలో ఎక్కడా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు.
దేవదాయ ధర్మాదాయ శాఖాధికారులు తమ దేవాలయాల వద్ద సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఖాజావలి, బందరు డీఎస్పీ మెహబూబ్ బాషా, వ్యక్తిత్వ వికాస నిపుణుడు విడియాల చక్రవర్తి, చిలకలపూడి సీఐ వెంకట నారాయణ, ఆర్పేట సీఐ వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ కొండయ్య, ఏ. నాగేశ్వరరావు, ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ, తదితరులు మాట్లాడారు.