మద్యం తరలింపుపై ఉక్కుపాదం
ABN , First Publish Date - 2020-08-08T07:58:59+05:30 IST
అక్రమ మద్యం రవాణా చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ రవీంద్రనాథ్బాబు హెచ్చరించారు.
మచిలీపట్నం టౌన్, ఆగస్టు 7 : అక్రమ మద్యం రవాణా చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ రవీంద్రనాథ్బాబు హెచ్చరించారు. శుక్రవారం పది పోలీసు స్టేషన్ల పరిధిలో 123 కేసులకు చెందిన 868 లీటర్ల నాటుసారాను ఆయన ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నాటుసారా తయారీదారులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. బందరు, గుడివాడ, అవనిగడ్డ సబ్డివిజన్లలో నాటుసారా తయారీదారులపై చర్యలు తీసుకుంటు న్నామన్నారు. ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ వకుల్ జిందాల్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ డి.ప్రభాకర్, ఏఆర్ ఏఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు. అవనిగడ్డ టౌన్ : నాగాయలంక మండలం సంగమేశ్వరం గ్రామంలో శుక్రవారం ఇద్దరి నుంచి 12 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.