తాగునీటి చెరువుల వద్ద పరిశుభ్రత పాటించాలి

ABN , First Publish Date - 2020-12-15T06:16:32+05:30 IST

గ్రామాల్లో మంచినీటి చెరువుల వద్ద శుభ్రత పాటించాలని ఎంపీడీవో అనగాని వెంకటరమణ అన్నారు.

తాగునీటి చెరువుల వద్ద పరిశుభ్రత పాటించాలి
కల్వపూడి అగ్రహారంలో మనం - మన పరిశుభ్రత ర్యాలీ

గుడివాడ రూరల్‌ :  గ్రామాల్లో మంచినీటి చెరువుల వద్ద శుభ్రత పాటించాలని ఎంపీడీవో అనగాని వెంకటరమణ అన్నారు. కల్వపూడి అగ్రహారంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో మనం - మన పరిశుభ్రత పక్షోత్సవాలలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు.  కాలుష్య రహిత సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.   ప్రభుత్వ పథకాలను జాప్యం లేకుండా ప్రజలకు అందించాలన్నారు. ఈవోపీఆర్డీ డి.వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ అట్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి హరికృష్ణ పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-15T06:16:32+05:30 IST