రైతుల దీక్షకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన
ABN , First Publish Date - 2020-12-25T06:26:07+05:30 IST
ఢిల్లీలో రైతులు చేపట్టిన దీక్షలకు మద్దతుగా సీపీఐ ఆధ్వర్యంలో కోసూరులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
![రైతుల దీక్షకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన](https://media.andhrajyothy.com/appimg/galleries/2020122512530417/12252020005558n31.jpeg)
కూచిపూడి, డిసెంబరు 24 : ఢిల్లీలో రైతులు చేపట్టిన దీక్షలకు మద్దతుగా సీపీఐ ఆధ్వర్యంలో కోసూరులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. దగాని సంగీతరావు, కె.వి. అప్పారావు, చెరకు శ్రీనివాసరావు, కోదాటి నారా యణరావు, కొండా నాగేశ్వరరావు, మోదుమూడి సద్గుణరావు, బోరుకాటి నరసింహరాజు, చందోలు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.