-
-
Home » Andhra Pradesh » Krishna » road accident
-
ఆటో ఢీకొని దంపతులకు గాయాలు
ABN , First Publish Date - 2020-12-28T06:07:08+05:30 IST
ఎస్.ఎన్.గొల్లపాలెంకు చెందిన కె.అబ్రహ్మం - జ్యోతి దంపతులు బైక్పై చల్లపల్లి నుంచి బందరు వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన ఆటో రామానగరం వద్ద ఢీకొట్టింది.

చల్లపల్లి : ఎస్.ఎన్.గొల్లపాలెంకు చెందిన కె.అబ్రహ్మం - జ్యోతి దంపతులు బైక్పై చల్లపల్లి నుంచి బందరు వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన ఆటో రామానగరం వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అబ్రహంకు తీవ్ర గాయాలు కాగా, జ్యోతి స్వల్పంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న పోలీస్ సిబ్బంది 108లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆటోను పోలీస్స్టేషన్కు తరలించారు.