4న సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తాం

ABN , First Publish Date - 2020-08-01T09:22:51+05:30 IST

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆలిం డియా స్టూడెంట్‌ జేఏసీ ఆధ్వర్వంలో ఈ నెల 4న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి..

4న సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తాం

 ఆలిండియా స్టూడెంట్‌ జేఏసీ జాతీయ చైర్మన్‌


విజయవాడ సిటీ: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆలిం డియా స్టూడెంట్‌ జేఏసీ ఆధ్వర్వంలో ఈ నెల 4న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి స్తామని జేఏసీ జాతీయ చైర్మన్‌ సగరపు ప్రసాద్‌ హెచ్చరించారు. మూడు రాజధానులు, సీఆర్‌డీఏ బిల్లులను గవర్నర్‌ ఆమోదించడంపై గాంధీనగర్‌లోని కార్యాలయంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆలిండియా ఫార్మర్స్‌ ఏపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, జేఏసీ నేతలు సుభాష్‌, వీరన్న, వెన్న శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-01T09:22:51+05:30 IST