మిసెస్ ఇండియా ఫైనలిస్ట్గా ‘బిందు మాధవి’
ABN , First Publish Date - 2020-10-27T16:14:36+05:30 IST
మిసెస్ ఇండియా ఏపీ ఫైనలిస్ట్గా విజయవాడకు చెందిన..

విజయవాడ(ఆంధ్రజ్యోతి): మిసెస్ ఇండియా ఏపీ ఫైనలిస్ట్గా విజయవాడకు చెందిన డాక్టర్ పరుచూరి బిందు మాధవి ఎంపికయ్యారు. మిసెస్ ఇండియా కాంపిటీషన్ ఆంఽద్రప్రదేశ్ ప్రతినిధి మమత త్రివేది ఈనెల 18న వర్చువల్గా ఈ పోటీలను నిర్వహించారు. రాష్ట్రాల వారీగా జరిగిన పోటీలో ఏపీ నుంచి ఫైనల్కు 25 మంది ఎంపికయ్యారు. వారందరినీ వెనక్కి తోసేసిన బిందు మాధవి మిసెస్ ఇండియా ఏపీ ఫైనలిస్ట్గా నిలిచారు. బిందు మాధవి పిల్లల వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ఆమెను జిల్లాపరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ తదితరులు సోమవారం ఘనంగా సత్కరించారు. గృహిణిగా, వైద్యురాలిగా, క్రీడాకారిణి రాణిస్తున్న బిందు మాధవి ఇప్పుడు మిసెస్ ఇండియా ఏపీ ఫైనలిస్ట్గా ఎంపికవ్వడం విజయవాడకే గర్వకారణమన్నారు. ఆమె జాతీయ స్థాయిలోనూ ఈ కిరీటాన్ని కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు.