స్వార్థ ప్రయోజనాల కోసమే రాజధాని తరలింపు
ABN , First Publish Date - 2020-02-08T10:57:52+05:30 IST
ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం రాజధానిని మూడు ముక్కలు చేస్తోందని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోపించారు.

బచ్చుల అర్జునుడు
గన్నవరం, ఫిబ్రవరి 7 : ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం రాజధానిని మూడు ముక్కలు చేస్తోందని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోపించారు. జేఏసీ ఆధ్వర్యంలో గన్నవరంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 23వ రోజుకు చేరాయి. సూరంపల్లి టీడీపీ నాయకులు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా బచ్చుల మాట్లాడుతూ ప్రజా రాజధానిని వికేంద్రీకరించటం దుర్మార్గమన్నారు. జేఏసీ కన్వీనర్ జాస్తి వెంకటేశ్వరరావు, నాయకులు దొంతు చిన్న, పాలడుగు నాని, కొండా వీరాస్వామి, దేవరపల్లి కోటేశ్వరరావు, చిమట రవివర్మ, కంభంపాటి బోస్, కనిగంటి బాలయ్య, ఈలప్రోలు శ్రీనివాసరావు, చల్లా దుర్గాప్రసాద్, దేవరపల్లి కోటేశ్వరరావు, వంగూరి మరియదాస్, నందేటి తిరుపతిరావు, డి.చంటి తదితరులు పాల్గొన్నారు.