మిసెస్- 2020 విన్నర్గా రమ్య
ABN , First Publish Date - 2020-12-31T05:05:40+05:30 IST
మిసెస్- 2020 విన్నర్గా రమ్య
విజయవాడ సిటీలైఫ్ : సతీష్ అడ్డాల క్రియేటివ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అందాల పోటీల్లో మిసెస్ 2020 కిరీటాన్ని నగరానికి చెందిన మండవ రమ్య దక్కించుకున్నారు. ఇక్కడే విద్యాభ్యాసం చేసిన రమ్య యూఎస్ఏలో డేటా సైంటిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న ఆమెకు చిన్నతనం నుంచి ఫ్యాషన్, మ్యూజిక్ అంటే ఆసక్తి ఎక్కువ. ఈ పోటీల్లో రాష్ట్రం నుంచి 180 మంది మహిళలు పాల్గొనగా, రమ్య ప్రథమ స్థానంలో నిలిచారు.