సమగ్ర సస్యరక్షణతో మామిడిలో అధిక దిగుబడులు
ABN , First Publish Date - 2020-12-20T05:41:10+05:30 IST
సమగ్ర సస్యరక్షణతో మామిడిలో అధిక దిగుబడులు

రెడ్డిగూడెం, డిసెంబరు 19: సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా మామిడిలో మంచి దిగుబడులు సాధించవచ్చని నూజివీడు మామిడి పరిశోధన శాస్త్రవేత్త రాజ్యలక్ష్మి చెప్పారు. ఏపీ జలవనరులశాఖ, ఉద్యానశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ నీటిపారుదల మరియు జీవన్పారుదల అభివృద్ధి పథకం - 2 ద్వారా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ సభ్యులకు, రైతులకు ఆహార విలువ గొలుసు అభివృద్ధి కార్యక్రమం కింద ఒక రోజు శిక్షణనిచ్చారు. అభ్యుదయ రైతు పాలంకి విజయభాస్కర్ రెడ్డి, ఏడీహెచ్ దయాకర్బాబు, రమేష్, ఎన్.వేణుమాధవ్, చేబ్రోలు కృపారాజులు పాల్గొన్నారు.