ఏం జరుగుతోంది?
ABN , First Publish Date - 2020-07-13T11:21:53+05:30 IST
ఓపక్క కరోనా విజృంభిస్తుంటే మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని స్థితి నెలకొంది.
మచిలీపట్నంలో 24 గంటల వ్యవధిలో నలుగురు మృతి
ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : ఓపక్క కరోనా విజృంభిస్తుంటే మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని స్థితి నెలకొంది. ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఇద్దరు, ఆదివారం మధ్యాహ్నానికి మరో ఇద్దరు మృతిచెందినట్టు సమాచారం. వారంతా ఏ కారణంతో మరణించారనేది చర్చనీయాంశంగా మారింది. ఆ నలుగురిలో ఒకరు పాజిటివ్ బాధితులని ఆసుపత్రివర్గాలు చెబుతున్నాయి.
అయితే ఇక్కడ పాజిటివ్ వచ్చినవారిని, సాధారణ రోగులను ఒకే వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గుడివాడకు చెందిన ఓ వ్యక్తి 11 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరి, ఆదివారం మరణించాడు. అతనిని కరోనా రోగుల మధ్య ఉంచి వైద్యం చేసినందునే చనిపోయాడని మృతుని బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.