లోకేష్ కైకలూరు పర్యటన నేడు
ABN , First Publish Date - 2020-10-20T07:28:28+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మంగళవారం కైకలూరు మండలంలోని ముంపు ప్రాంతాల్లో పర్య టించనున్నట్లు టీడీపీ ఇన్చార్జ్,
కైకలూరు : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మంగళవారం కైకలూరు మండలంలోని ముంపు ప్రాంతాల్లో పర్య టించనున్నట్లు టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకట రమణ విలేకరుల సమావేశంలో తెలిపారు. ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో లోకేష్కు ఘనస్వాగతం పలుకుతామన్నారు. కైకలూరు మసీదు వెనుక నుంచి జూనియర్ సివిల్ జడ్జికోర్టు వరకు ముంపును పరిశీలిస్తారన్నారు.
ఆలపాడు మీదుగా పెంచికలమర్రు గ్రామానికి చేరుకుని కొల్లేరు ముంపును పరిశీలించిన అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా పర్య టనకు వెళతారన్నారు. కొత్త నాగేంద్రకుమార్, పెన్మెత్స త్రినాఽథరాజు, సయ్యపురాజు గుర్రాజు, పోలవరపు లక్ష్మీరాణి, పూలరామచంద్రరావు, దావు నాగరాజు, ఎండీ జానీ పాల్గొన్నారు. ముదినేపల్లి/రూరల్: పెదపాలపర్రు విచ్చేసే లోకేష్కుకు ఘన స్వాగతం పలకటానికి టీడీపీ నాయకులు, కార్య కర్తలు భారీగా తరలిరావాలని మండల టీడీపీ అధ్యక్షుడు చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి కోరారు.