స్థలాల మెరక పూర్తి చేయాలి : ఎమ్మెల్యే దూలం
ABN , First Publish Date - 2020-09-25T10:17:14+05:30 IST
అభివృద్ధి పనులకు గుర్తించిన స్థలాల మెరక పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు.
కైకలూరు, సెప్టెంబరు 24 : అభివృద్ధి పనులకు గుర్తించిన స్థలాల మెరక పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల అధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు.
నాలుగు మండలాల్లోని 28 గ్రామ పంచాయతీల్లో నూతన భవన నిర్మాణాలకు ఉద్ధేశించిన స్థలాల మెరక పూర్తి చేయాలన్నారు. రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. తాగునీటిని అందించేందుకు ఫిల్టర్బెడ్లకు మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ డీఈ శాస్ర్తి,ఏఈలు నాగబాబు, కృష్ణారావు, షహనాజ్ పాల్గొన్నారు.