బీసీల సమస్యల పరిష్కారానికే కార్పొరేషన్లు: మంత్రి కొడాలి నాని
ABN , First Publish Date - 2020-10-21T16:18:34+05:30 IST
బీసీల సమస్యలను క్షేత్రస్థాయి నుంచి పరిష్కరించే దిశగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కొడాలి నాని కోరారు. స్థానిక రాజేంద్రనగర్లోని..

గుడివాడ: బీసీల సమస్యలను క్షేత్రస్థాయి నుంచి పరిష్కరించే దిశగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కొడాలి నాని కోరారు. స్థానిక రాజేంద్రనగర్లోని తన నివాసంలో మంగళవారం ఆయన గుడివాడ నియోజకవర్గం నుంచి రాష్ట్ర ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్ డైరెక్టరుగా నియమితుడైన షేక్ సయ్యద్ను సత్కరించారు. రాష్ట్రంలోని 139 బీసీ కులాలను ప్రతిబింబించేలా 56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రభుత్వ శాఖల అనుమతులతో చేపల చెరువులు తవ్వుకున్న తమను సాగు చేసుకునేందుకు అనుమతించాలని నందివాడ మండలం తమిరిశ రైతులు మంత్రి కొడాలి నానిని కోరారు.
నిత్యావసరాల పంపిణీ ప్రారంభం
రాష్ట్రంలో 14వ విడత ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ మంగళవారం ప్రారంభమైందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.50 కోట్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం, శనగలు అందజేస్తామని రాష్ట్ర మంత్రి కొడాలి నాని తెలిపారు.