చెలగాటం వద్దు
ABN , First Publish Date - 2020-03-27T09:05:17+05:30 IST
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని పూర్తి గా కరోనా ఆసుపత్రి (కరోనా ట్రీటింగ్ సెంటర్)గా మార్చడాన్ని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) తప్పుబట్టారు.
విజయవాడ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని పూర్తి గా కరోనా ఆసుపత్రి (కరోనా ట్రీటింగ్ సెంటర్)గా మార్చడాన్ని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) తప్పుబట్టారు. నగరం న డిబొడ్డున 1050 పడకలతో జిల్లాలోనే పెద్ద బోధ నాసుపత్రిగా ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఖాళీ చేయించి కరోనా వ్యాధిగ్రస్థులకు ఐసోలేషన్ వార్డులుగా, కరోనా ట్రీటింగ్ సెంటర్గా మార్చేసిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎంపీ కేశినేని నాని గురువారం ట్విట్ట ర్ వేదికగా తప్పుబట్టారు. నగరంలో జనావాసాల మధ్యలోని ఆస్పత్రిని ఇలా మార్చడం ప్రజల ఆరో గ్యానికి మంచిది కాదన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని, ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, కరోనా ఐసోలేషన్ వార్డులను నగరానికి దూరంగా పెట్టాలని కృష్ణా జిల్లా కలెక్టరు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లకు ఆయన సూచించారు.