జగన్ వైఖరిపై కేంద్రానికి లేఖ రాస్తా: ఎంపీ కేశినేని నాని
ABN , First Publish Date - 2020-07-08T20:35:55+05:30 IST
విజయవాడ నగరాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న జగన్ వైఖరిపై..

విజయవాడ(ఆంధ్రజ్యోతి): విజయవాడ నగరాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న జగన్ వైఖరిపై కేంద్రానికి లేఖ రాస్తానని పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్(నాని) తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అభివృద్ధి పనులను అడ్డుకుంటోందంటూ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావుతో కలిసి మంగళవారం ఎంపీ కేశినేని నాని నగరంలోని మూడో డివిజన్లో పర్యటించారు. స్థానిక సమస్యలపై ప్రజలతో చర్చించారు.