16న కనకదుర్గా ఫ్లైఓవర్ ప్రారంభం
ABN , First Publish Date - 2020-10-14T16:09:20+05:30 IST
వాయిదాల మీద వాయిదాలు పడుతు న్న కనకదుర్గా ఫ్లైఓవర్కు ఎట్టకేలకు ఈనెల..

హాజరు కానున్న కేంద్రమంత్రి గడ్కరీ
ఆంధ్రజ్యోతి, విజయవాడ: వాయిదాల మీద వాయిదాలు పడుతు న్న కనకదుర్గా ఫ్లైఓవర్కు ఎట్టకేలకు ఈనెల 16న మోక్షం కలగనుంది. పలు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం మరిన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల సంస్థ అధికారులకు అధికారిక సమాచారం అందింది. కరోనా బారిన పడిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోలుకోవటంతో 16నే ప్రారంభోత్సవం ఉంటుందని ఎంపీ కేశినేని శ్రీనివాస్ ముందే ట్విట్టర్లో పేర్కొన్నారు. వర్చువల్ విధానంలో కేంద్రమంత్రి గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొంటారు. మంత్రులు స్వయంగా హాజరుకానున్నారు.