3న ఇంటర్ పరీక్షలు
ABN , First Publish Date - 2020-06-01T09:28:15+05:30 IST
కరోనా కారణంగా వాయిదా పడిన ఇంటర్మీడియెట్ మోడరన్ లాంగ్వేజ్-2, తెలుగు-2, మోడరన్ లాంగ్వేజ్ ఇంగ్లిష్-2 పరీక్షలను జూన్ 3వ తేదీన నిర్వహించనున్నట్లు
విజయవాడ, మే 31 (ఆంధ్రజ్యోతి) : కరోనా కారణంగా వాయిదా పడిన ఇంటర్మీడియెట్ మోడరన్ లాంగ్వేజ్-2, తెలుగు-2, మోడరన్ లాంగ్వేజ్ ఇంగ్లిష్-2 పరీక్షలను జూన్ 3వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్ఐవో) పి.రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆరోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మోడరన్ లాంగ్వేజ్-2, తెలుగు-2, మోడరన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్-2 పరీక్షలను మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోను, మచిలీపట్నంలోని హిందూ కళాశాలలోనూ నిర్వహిస్తామని పేర్కొన్నారు. మార్చి 23న జరగాల్సిన పరీక్షలు కరోనా వల్ల వాయిదా పడ్డాయని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్లను బీఐఈఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ముఖానికి మాస్క్ ధరించాలని, వాటర్ బాటిల్ను వెంట తెచ్చుకోవాలని, పరీక్ష కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాలని సూచించారు.