‘ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’

ABN , First Publish Date - 2020-03-27T15:46:11+05:30 IST

విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని..

‘ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’

ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు

ఐసోలేషన్‌ వార్డులను నగరానికి దూరంగా పెట్టండి 

ఎంపీ కేశినేని ట్వీట్‌ 


విజయవాడ(ఆంధ్రజ్యోతి): విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని పూర్తిగా కరోనా ఆసుపత్రి (కరోనా ట్రీటింగ్‌ సెంటర్‌)గా మార్చడాన్ని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌ (నాని) తప్పుబట్టారు. నగరం నడిబొడ్డున 1050 పడకలతో జిల్లాలోనే పెద్ద బోధనాసుపత్రిగా ఉన్న ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని ఖాళీ చేయించి కరోనా వ్యాధిగ్రస్థులకు ఐసోలేషన్‌ వార్డులుగా, కరోనా ట్రీటింగ్‌ సెంటర్‌గా మార్చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎంపీ కేశినేని నాని గురువారం ట్విట్టర్‌ వేదికగా తప్పుబట్టారు. నగరంలో జనావాసాల మధ్యలోని ఆస్పత్రిని ఇలా మార్చడం ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని, ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, కరోనా ఐసోలేషన్‌ వార్డులను నగరానికి దూరంగా పెట్టాలని కృష్ణా జిల్లా కలెక్టరు, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌లకు ఆయన సూచించారు.


Updated Date - 2020-03-27T15:46:11+05:30 IST