అసెంబ్లీ రద్దు చేసే ధైర్యం జగన్కు లేదు : జయమంగళ
ABN , First Publish Date - 2020-08-06T19:07:05+05:30 IST
మూడు రాజధానులపై మాజీ సీఎం చంద్రబాబు విసిరిన సవాల్ 48 గంటలు గడిచినప్పుటికీ..
కైకలూరు(కృష్ణా): మూడు రాజధానులపై మాజీ సీఎం చంద్రబాబు విసిరిన సవాల్ 48 గంటలు గడిచినప్పుటికీ వైసీపీ ప్రభుత్వం స్వీకరించేందుకు ముందుకు రాలేదని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెకంటరమణ విమర్శించారు. 48గంటల సమయం ఇచ్చినప్పటికీ అసెంబ్లీ రద్దు చేసే ధైర్యం జగన్కు లేదన్నారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. బాధితులకు మెరుగైన వైద్యమందించేందుకుచర్యలు తీసుకోవాలన్నారు.