ప్రతిభ చూపిన ముగ్గురు విద్యార్థినులకు సత్కారం
ABN , First Publish Date - 2020-12-20T06:08:13+05:30 IST
విద్యలో ప్రతిభ కన బర్చిన ముగ్గురు విద్యార్థినులను మోపిదేవి గ్రామస్థులు ఘనంగా సత్కరిం చారు.

మోపిదేవి : విద్యలో ప్రతిభ కన బర్చిన ముగ్గురు విద్యార్థినులను మోపిదేవి గ్రామస్థులు ఘనంగా సత్కరిం చారు. కొత్తపల్లి నమిత జేఈఈ మెయిన్స్లో ఆలిండియా స్థాయిలో 44వ ర్యాంకు, దక్షిణ భారత స్థాయిలో ప్రథమ స్థానం, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో 20వ ర్యాంకు, తెలంగాణ ఎంసెట్లో 30వ ర్యాంకు సాధించింది. కొత్తపల్లి నాగమౌనిక ఎంబీబీఎస్ పోస్టు గ్రాడ్యుయేషన్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. కొక్కిలిగడ్డ కిన్నెర ట్రీపుల్ ఐటీ సీటు సాధించి నాసా ప్రయోగానికి ఎంపికైంది. తల్లిదండ్రులకు, గ్రామానికి కీర్తిప్రతిష్ఠలు తీసుకొచ్చిన ముగ్గురు విద్యార్థిను లను ఘనంగా సత్కరించారు. సీడీసీ ఛైర్మన్ రావి నాగేశ్వరరావు, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కంఠమనేని కుటుం బరావు, కావూరి కోదండ రామయ్య, ఆర్.డిఎస్.రెడ్డి తదితరులు విద్యార్థినులను అభినందించారు.