ఎంపీ నానీని మర్యాదపూర్వకంగా కలిసిన అనిత
ABN , First Publish Date - 2020-12-04T06:23:35+05:30 IST
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నియమితులైన మాజీ శాసన సభ్యురాలు వంగలపూడి అనిత గురువారం విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) ని గవర్నర్పేట కేశినేని భవన్లో మర్యాదపూ ర్వకంగా కలిశారు.
విద్యాధరపురం, డిసెంబరు 3 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నియమితులైన మాజీ శాసన సభ్యురాలు వంగలపూడి అనిత గురువారం విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) ని గవర్నర్పేట కేశినేని భవన్లో మర్యాదపూ ర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ నాని అనితకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి శు భాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ పార్ల మెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు సీహెచ్ ఉషారాణి, పార్టీ నాయకులు లింగమనేని శివరాం ప్రసాద్, పి.రాజేష్ పాల్గొన్నారు.