డీఎస్సీ 1998 అభ్యర్థుల విజ్ఞాపన దీక్ష
ABN , First Publish Date - 2020-12-13T05:59:24+05:30 IST
ఏపీ డీఎస్సీ 1998 క్వాలిఫైడ్స్ ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర హామీ నెరవేర్చాలని కోరుతూ మూడు రోజుల ‘జగనన్న పై నమ్మకం’ విజ్ఞాపన దీక్ష శనివారం ధర్నాచౌక్లో ప్రారంభించారు.

డీఎస్సీ 1998 అభ్యర్థుల విజ్ఞాపన దీక్ష
విజయవాడ సిటీ: ఏపీ డీఎస్సీ 1998 క్వాలిఫైడ్స్ ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర హామీ నెరవేర్చాలని కోరుతూ మూడు రోజుల ‘జగనన్న పై నమ్మకం’ విజ్ఞాపన దీక్ష శనివారం ధర్నాచౌక్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సాయిరామ్ ప్రసాద్ మాట్లాడుతూ 22 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న డీఎస్సీ 1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యను పరిష్కరించాలన్నారు. ఎమ్మెల్సీ కమిటీ రిపోర్టును అమలు చేయాలన్నారు. ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, రాము సూర్యారావు, ఐ. వెంకటేశ్వరరావు ఈ దీక్షలో పాల్గొని సమస్య పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. రాఘవేంద్రరావు, ఆదాం తదితరులు పాల్గొన్నారు.