డీఎస్సీ 1998 అభ్యర్థుల విజ్ఞాపన దీక్ష

ABN , First Publish Date - 2020-12-13T05:59:24+05:30 IST

ఏపీ డీఎస్సీ 1998 క్వాలిఫైడ్స్‌ ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర హామీ నెరవేర్చాలని కోరుతూ మూడు రోజుల ‘జగనన్న పై నమ్మకం’ విజ్ఞాపన దీక్ష శనివారం ధర్నాచౌక్‌లో ప్రారంభించారు.

డీఎస్సీ 1998 అభ్యర్థుల విజ్ఞాపన దీక్ష

డీఎస్సీ 1998 అభ్యర్థుల విజ్ఞాపన దీక్ష

విజయవాడ సిటీ: ఏపీ డీఎస్సీ 1998 క్వాలిఫైడ్స్‌ ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర హామీ నెరవేర్చాలని కోరుతూ మూడు రోజుల  ‘జగనన్న పై నమ్మకం’ విజ్ఞాపన దీక్ష శనివారం  ధర్నాచౌక్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు  సాయిరామ్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ 22 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న డీఎస్సీ 1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థుల సమస్యను పరిష్కరించాలన్నారు. ఎమ్మెల్సీ కమిటీ రిపోర్టును అమలు చేయాలన్నారు. ఎమ్మెల్సీలు కేఎస్‌ లక్ష్మణరావు, రాము సూర్యారావు, ఐ. వెంకటేశ్వరరావు ఈ దీక్షలో పాల్గొని సమస్య పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. రాఘవేంద్రరావు, ఆదాం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-13T05:59:24+05:30 IST