మన కోసం మనం ట్రస్టుకు రూ.5 లక్షల విరాళం
ABN , First Publish Date - 2020-12-13T06:11:21+05:30 IST
మన కోసం మనం ట్రస్టుకు రూ.5 లక్షల విరాళం

చల్లపల్లి : స్వచ్ఛ సుందర చల్లపల్లి సాధన, అభివృద్ధి, సుందరీకరణ పనులు చేస్తున్న మన కోసం - మనం ట్రస్టుకు డాక్టర్ డీఆర్కే ప్రసాద్, పద్మావతి కుమార్తె, ఎన్ ఆర్ఐ దాసరి స్నేహ - నాగేంద్ర కుమార్ దంపతులు రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. దుబాయ్ నుంచి వచ్చిన వారు శనివారం స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలతో కలిసి సేవలందించారు. విరాళాన్ని ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ పద్మావతికి అందజేశారు. దాసరి స్నేహ-నాగేంద్రకుమార్ దంపతులు స్వచ్ఛ చల్లపల్లి కోసం ఇప్పటి వరకు రూ.16 లక్షలు విరాళంగా అందజేశారు. స్నేహ దంపతులకు డాక్టర్ డీఆర్కే ప్రసాద్, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.