టీచర్లను బదిలీ చేయొద్దు

ABN , First Publish Date - 2020-12-30T06:49:57+05:30 IST

కంభంపాడు జడ్పీ పాఠశాలలోని ఉపాధ్యాయుల బదిలీలను నిలిపివేయా లని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

టీచర్లను బదిలీ చేయొద్దు
కంభంపాడులో విద్యార్థుల మానవహారం

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా

ఎ.కొండూరు, డిసెంబరు 29 : కంభంపాడు జడ్పీ పాఠశాలలోని ఉపాధ్యాయుల బదిలీలను నిలిపివేయా లని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సోమేశ్వరరావు మాట్లాడుతూ పాఠశాలలో 450 మంది విద్యార్థులు ఉండగా అందుకు అనుగుణంగానే ఉపాధ్యాయులు ఉన్నారు. కాని విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నారనే నెపంతో తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు ఉపాధ్యాయులను బదిలీ చేయటం దుర్మార్గమన్నారు. ఈ బదిలీ ప్రక్రియ అపాలని లేని పక్షంలో ఆందోళన చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. అనంతరం కంభంపాడు జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. జెట్టి వెంకటేశ్వరరావు, కల్యాణి పాల్గొన్నారు.



Updated Date - 2020-12-30T06:49:57+05:30 IST