రైతు కేంద్రాల్లో ఏదీ భరోసా?

ABN , First Publish Date - 2020-12-30T06:15:18+05:30 IST

ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు భరోసా లేకుండా పోయిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ విజయవాడ పార్లమెంటరీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం మండిపడ్డారు.

రైతు కేంద్రాల్లో ఏదీ భరోసా?
పత్తి మొక్కలను తగలబెట్టి నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలు

హైవేపై పత్తి మొక్కలను తగలబెట్టి టీడీపీ నిరసన 

కంచికచర్ల రూరల్‌, డిసెంబరు 29: ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు భరోసా లేకుండా పోయిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ విజయవాడ పార్లమెంటరీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం మండిపడ్డారు. ‘రైతుల కోసం తెలుగుదేశం’లో భాగంగా మంగళవారం వారు కంచికచర్ల మండలం పరిటాలలో పత్తి పొలాలను పరిశీలించారు. అనంతరం జాతీయ రహదారిపై పత్తి మొక్కలను దహనం చేసి నిరసన తెలిపారు. బోగస్‌, ఫేక్‌ మాటలు మానుకోవాలంటూ రైతులతో కలిసి నేతలు నినాదాలు చేశారు.


Updated Date - 2020-12-30T06:15:18+05:30 IST