67 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-12-28T07:03:09+05:30 IST

జిల్లాలో ఆదివారం కొత్తగా 67 మందికి కరోనా వైరస్‌ సోకింది.

67 మందికి కరోనా

మరో బాధితుడు మృతి  

106 మంది డిశ్చార్జి 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో ఆదివారం కొత్తగా 67 మందికి కరోనా వైరస్‌ సోకింది. మరో పాజిటివ్‌ బాధితుడు కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 47,568కి పెరిగింది. కరోనా మరణాలు అధికారికంగా 664కు చేరుకున్నాయి. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 106 మంది గడిచిన 24 గంటల్లో వ్యాధి నుంచి కోలుకుని తమ ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 599 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-12-28T07:03:09+05:30 IST