కృష్ణాలో 38 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-12-27T06:36:08+05:30 IST
జిల్లాలో శనివారం మరో 38 మందికి కరోనా వైరస్ సోకింది.
58 మంది డిశ్చార్జి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) :
మందికి కరోనా వైరస్ సోకింది. ఈ కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47,501కి పెరిగింది. కొత్తగా మరణాలు నమోదు కాకపోవడంతో వీటి సంఖ్య 663 వద్ద నిలకడగానే ఉంది. గడిచిన 24 గంటల్లో కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పాజిటివ్ బాధితుల్లో 58 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 639 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.