-
-
Home » Andhra Pradesh » Krishna » covid in krishna
-
37 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-12-15T06:16:22+05:30 IST
జిల్లాలో సోమవారం కొత్తగా 37 మందికి కరోనా వైరస్ సోకింది.

ఆసుపత్రుల నుంచి 37 మంది డిశ్చార్జి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో సోమవారం కొత్తగా 37 మందికి కరోనా వైరస్ సోకింది. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పాజిటివ్ బాధితుల్లో 37 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,721కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో మరణాలు నమోదు కాకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. దీంతో కరోనా మరణాల సంఖ్య 654 వద్ద నిలకడగానే ఉంది. ఇంకా 884 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.