32 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-12-29T07:06:51+05:30 IST
జిల్లాలో సోమవారం కొత్తగా 32 మందికి కరోనా వైరస్ సోకింది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
జిల్లాలో సోమవారం కొత్తగా 32 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47,600కు పెరిగింది. మరణాలు 664 వద్ద నిలకడగానే ఉన్నాయి. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 48 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 583 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.