కృష్ణాలో 54 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-12-25T07:11:15+05:30 IST

కృష్ణాజిల్లాలో గురువారం కొత్తగా 54 మందికి కరోనా వైరస్‌ సోకింది.

కృష్ణాలో 54 మందికి కరోనా

మరో బాధితుడు మృతి   

57 మంది డిశ్చార్జి


విజయవాడ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : కృష్ణాజిల్లాలో గురువారం కొత్తగా 54 మందికి కరోనా వైరస్‌ సోకింది. మరో పాజిటివ్‌ బాధితుడు కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 47,420కి పెరిగాయి. కొవిడ్‌ మరణాలు అధికారికంగా 662కు చేరుకున్నాయి. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 57 మంది గడిచిన 24 గంటల్లో వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా కొవిడ్‌ ఆసుపత్రుల్లో 674 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-12-25T07:11:15+05:30 IST