కరోనా నుంచి కోలుకున్నా : ఉదయభాను
ABN , First Publish Date - 2020-08-11T14:02:59+05:30 IST
కరోనా నుంచి తాను కోలుకున్నానని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను..
జగ్గయ్యపేట(కృష్ణా): కరోనా నుంచి తాను కోలుకున్నానని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను చెప్పారు. సోమవారం మీడియాకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 26న తనకు ఎలాంటి లక్షణాలూ లేకుండా కరోనా సోకిందని, సిటీ స్కాన్ చేయించుకున్నానని, హోం క్వారంటైన్లో ఉండి వైద్యులు సూచించిన మందులు వాడానని చెప్పారు. రోజూ ఆవిరి పట్టి పౌష్టికాహారం తీసుకోవడంతో కోలుకున్నానని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావాలని, కరోనా సోకితే జీవితం లేదని అనుకోవద్దని కొవిడ్ బాధితులను కోరారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు పెంచామని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.