జగన్ నీతులు చెప్తుంటే..దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది..

ABN , First Publish Date - 2020-12-02T18:06:05+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో సభ మర్యాదల గురించి నీతులు చెబుతుంటే..

జగన్ నీతులు చెప్తుంటే..దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది..

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో సభ మర్యాదల గురించి నీతులు చెబుతుంటే..దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది.. పద్ధతిగా ఉండాలి.. పద్ధతిగా నడవాలి.. ఈ మాటలు విని పద్ధతే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సరిగ్గా విన్నానా? లేదా? అని కళ్లు నులుముకుని మరీ చూసింది. నిజమే అని తెలిసాక ఒక్కసారి ఫ్లాస్ బ్లాక్‌లోకి వెళ్లిపోయింది. అన్నీ తలచుకుని ఏమిటీ విధి వైఫరీత్యమంటూ నిట్టూర్చింది. అవును మరీ పద్ధతి గురించి ‘‘ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు క్లాస్ తీసుకుంటుంటే.. అదీ కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుగారికి తీసుకుంటుంటే.. అధికారపార్టీ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు’’. ఇంతకీ పద్ధతంటే ఏంటో గతంలో సీఎం జగన్ మనకు చూపించిన డెమోను మరోసారి చూడిండి.. 

Updated Date - 2020-12-02T18:06:05+05:30 IST