వినూత్న నిరసన

ABN , First Publish Date - 2020-12-29T06:55:40+05:30 IST

కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చలిలో ఆందోళన చేస్తున్న అన్నదాతలకు మద్దతు తెలుపుతూ సోమవారం యువజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షు డు నజీర్‌ ఆధ్వర్యంలో సంస్థ రాష్ట్ర నాయకులు రైతు కూలీలతో కలిసి పొలంలో వరినాట్లు వేస్తూ వినూ త్న నిరసన తెలిపారు.

వినూత్న నిరసన
వరినాట్లు వేస్తూ నిరసన తెలుపుతున్న యువజన చైతన్య వేదిక సభ్యులు

వినూత్న నిరసన

రామలింగేశ్వరనగర్‌ :  కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చలిలో ఆందోళన చేస్తున్న అన్నదాతలకు మద్దతు తెలుపుతూ సోమవారం యువజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షు డు నజీర్‌ ఆధ్వర్యంలో సంస్థ రాష్ట్ర నాయకులు రైతు కూలీలతో కలిసి పొలంలో వరినాట్లు  వేస్తూ వినూ త్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నజీర్‌ మాట్లాడుతూ అన్నదాత కన్నీరు పెడితే ఏ ప్రభుత్వ మైనా కాలగర్భంలో కలిసి పోవాల్సిందేనన్నారు. ఇకనైనా కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. రాజీవ్‌గాంధీ మొహమ్మద్‌ షారుఖ్‌, లంకా సురేష్‌, సాయి, సత్యనారాయణ, రాజా పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T06:55:40+05:30 IST