-
-
Home » Andhra Pradesh » Krishna » bza news
-
కరోనాపై సమరశంఖం
ABN , First Publish Date - 2020-10-31T08:29:17+05:30 IST
ప్రజలంతా అవగాహనతో మెలుగుతూ, జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సమరశంఖం పూరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్, కలెక్టర్ ఇంతియాజ్ పిలుపునిచ్చారు.

రామలింగేశ్వరనగర్, అక్టోబరు 30: ప్రజలంతా అవగాహనతో మెలుగుతూ, జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సమరశంఖం పూరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్, కలెక్టర్ ఇంతియాజ్ పిలుపునిచ్చారు. కరోనాను అరికట్టాలంటూ బెంజిసర్కిల్ నుంచి పీడబ్ల్యూడీ గ్రౌండ్ వరకు శుక్రవారం రాత్రి భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కాటంనేని భాస్కర్, ఇంతియాజ్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించండి, భౌతిక దూరం పాటించండి, కరోనా వైరస్ను పారదోలండి అనే నినాదాలతో ర్యాలీ ముందుకు సాగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినా జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, నిబంధనలు పాటిస్తూ ప్రతి రంగంలోనూ యాక్టివిటీ నిర్వహించాలన్నారు. పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. జాయింట్ కలెక్టర్ కె.మాధవీలత, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, జేసీలు ఎల్.శివశంకర్, కె.మోహన్కుమార్, సబ్ కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.సుహాసిని తదితరులు పాల్గొన్నారు.