లాకప్డెత్పై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ
ABN , First Publish Date - 2020-10-03T11:27:50+05:30 IST
విజయవాడ కృష్ణలంక పోలీసుల విచారణలో ఉన్న అజయ్ అనుమానాస్పద మృతి ఘటనపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని నియమించింది.
![లాకప్డెత్పై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
విజయవాడ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ కృష్ణలంక పోలీసుల విచారణలో ఉన్న అజయ్ అనుమానాస్పద మృతి ఘటనపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని నియమించింది. ఈ కమిటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు, మాజీ మంత్రి కె.ఎస్.జవహర్, పామర్రు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ వాసం మునియ్య, మాజీ కార్పొరేటర్ దోమకొండ జ్యోతిని సభ్యులుగా నియమించింది. కమిటీ సభ్యులు వాస్తవాలు తెలుసుకుని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు నివేదిక అందజేస్తారు.