పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేస్తుంది: విష్ణువర్ధన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-12-02T19:09:26+05:30 IST

పోలవరం నిర్మాణం కేంద్రం పూర్తి చేస్తుందని...పోలవరం అంశంలో బీజేపీపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు.

పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేస్తుంది: విష్ణువర్ధన్‌రెడ్డి

విజయవాడ:  పోలవరం నిర్మాణం కేంద్రం పూర్తి చేస్తుందని...పోలవరం అంశంలో బీజేపీపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి  దుయ్యబట్టారు. బుధవారం విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షులుగా  బబ్బూరి శ్రీరామ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.  ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజు, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ...ఏపీలో కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. వైసీపీ పార్టీలో తల్లి, చెల్లి, తన కుటుంబ సభ్యులతో పార్టీ, ప్రభుత్వాన్ని జగన్ నడిపిస్తున్నారని విమర్శించారు.ఏపీ ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టయ్యిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ కుటుంబ, వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ, శాసనమండలిలో ప్రజా సమస్యలను పక్కనపెట్టి...వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని అన్నారు. నంద్యాల సలాం కుటుంబ ఆత్మహత్య అంశంపై కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.

Updated Date - 2020-12-02T19:09:26+05:30 IST