బందరు, పేటలో షాపులు మధ్యాహ్నం వరకే

ABN , First Publish Date - 2020-07-10T09:47:22+05:30 IST

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మచిలీ పట్నంలో వ్యాపార సంస్థలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే ..

బందరు, పేటలో షాపులు మధ్యాహ్నం వరకే

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం :  కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మచిలీ పట్నంలో వ్యాపార సంస్థలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని ఆర్డీవో ఖాజావలి పేర్కొన్నారు. బందరు డివిజన్‌లో 58 కంటైన్మెంట్‌ జోన్లు ఉన్నాయన్నారు. జగ్గయ్యపేట: కిరాణా ఇతర దుకాణాలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మెడికల్‌ షాపులు సాయం త్రం 5గంటలకు వరకు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నామని తహసీల్ధార్‌ రామ కృష్ణ తెలిపారు. కూరగాయల సంచార బండ్లను చెరువుకట్ట వైపునకు తరలిస్తు న్నట్టు తెలిపారు. కమిషనర్‌ రామ్మోహన్‌, సీఐ నాగేంద్రకుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-10T09:47:22+05:30 IST