అత్తమామల హత్యకేసులో నిందితుడు అరెస్టు

ABN , First Publish Date - 2020-12-19T06:06:13+05:30 IST

కట్నం ఇవ్వలేదనే కోపంతో భార్యతో కలిసి అత్తమామల పీకకోసి హత్యచేసిన బండిపాలెం గ్రామ వలంటీరును, మైనర్‌ అయిన అతని భార్యను అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి చెప్పారు.

అత్తమామల హత్యకేసులో నిందితుడు అరెస్టు

సహకరించిన భార్య కూడా..

జగ్గయ్యపేట, డిసెంబరు 18: కట్నం ఇవ్వలేదనే కోపంతో భార్యతో కలిసి అత్తమామల పీకకోసి హత్యచేసిన బండిపాలెం గ్రామ వలంటీరును, మైనర్‌ అయిన అతని భార్యను అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి చెప్పారు. శుక్రవారం స్థానిక శాంతిభద్రతల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంలో డీఎస్పీ నాగేశ్వరరెడ్డి వివరాలు వెల్లడించారు. బండిపాలెంలో కోట ముత్తయ్య రెండో భార్య సుగుణమ్మకు ఇద్దరు కుమార్తెలు. ఆ గ్రామంలో వలంటీరుగా పనిచేస్తున్న నెమలి బాబురావు ముత్తయ్య రెండో కుమార్తెను ప్రేమించాడు. వివాహానికి రెండు వైపుల వాళ్లు అంగీకరించలేదు. ఆమెను తీసుకెళ్లి నందిగామ పల్లగిరి గట్టుపై నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అనంతరం కుల పంచాయతీలో లక్ష రూపాయలు కట్నం ఇచ్చేందుకు ముత్తయ్య దంపతులు ఒప్పుకున్నారు. ఆ డబ్బు ఇవ్వకపోవటంతో అత్తమామలను హతమార్చాలని బాబూరావు నిర్ణయించుకున్నాడు. మైనర్‌ అయిన భార్య సహకారం తీసుకున్నాడు. ఈ నెల 15న ఇంట్లో నిద్రపోతున్న ముత్తయ్యను... భార్యతో కలిసి బాబురావు, సుగుణమ్మను కత్తితో చాతిపై పొడిచి, పీకకోసి చంపాడు. ఆ సమయంలో అక్కడ నిద్రపోతున్న ఏడేళ్ల బాలికను బెదిరించి వదిలేశారు. ముత్తయ్య మొదటి భార్య కుమారుడు కోట సుందరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాబురావును, అతని భార్యను అరెస్టు చేసినట్లు చెప్పారు.  

Updated Date - 2020-12-19T06:06:13+05:30 IST