ఏపీ మంత్రుల నివాసం, కార్యాలయాల్లో అదనపు భద్రత
ABN , First Publish Date - 2020-12-03T17:00:04+05:30 IST
రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై జరిగిన దాడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
కృష్ణా: రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై జరిగిన దాడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో మంత్రుల నివాసం, కార్యాలయాల్లో అదనపు భద్రతా చర్యలు చేపట్టారు. గుడివాడలోని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నివాసంలో మెటల్ డిక్టర్, డిజిటల్ స్కానర్ల ఏర్పాటు చేశారు. మంత్రి కొడాలి నాని నివాసాన్ని డాగ్ స్క్వాడ్తో భద్రతా సిబ్బంది అణువణువునా తనిఖీలు చేస్తూ, మంత్రి నివాసాన్ని అధీనంలోకి తీసుకున్నారు. సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే మంత్రి నివాసంలోకి అనుమతిస్తున్నారు.