అమరావతిని ఆపారు..

ABN , First Publish Date - 2020-06-05T09:14:20+05:30 IST

అమరావతిలో నిర్మాణాలు నిలిపివేయటంతో రాష్ట్ర ఆర్థిక రంగం కుదేలై.. అప్పుల ఊబిలోకి నెట్టబడిందని ..

అమరావతిని ఆపారు..

అప్పుల ఊబిలోకి నెట్టారు


గుంటూరు(ఆంధ్రజ్యోతి), తాడికొండ, జూన్‌ 4: అమరావతిలో నిర్మాణాలు నిలిపివేయటంతో రాష్ట్ర ఆర్థిక రంగం కుదేలై.. అప్పుల ఊబిలోకి నెట్టబడిందని ఆ ప్రాంత రైతులు తెలిపారు. రాష్ట్ర పాలనంతా అమరా వతి నుంచే కొనసాగించాలంటూ రాజధానికి భూములి చ్చిన రైతులు, కూలీలు, మహిళలు చేస్తోన్న ఆందోళన గురువారానికి 170వ రోజుకు చేరాయి. పరిపాలనలో కాదు అభివృద్ధిలో వికేంద్రీకరణ చేయాలంటూ నినా దాలు చేశారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం భూములిచ్చిన పాపానికి నేడు రోడ్డెక్కి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతితోనే రాష్ట్రానికి వెలుగంటూ ఇళ్లలో విద్యుత్‌ దీపాలను ఆర్పి కొవ్వొ త్తులు, దీపాలు వెలిగించి జై అమరావతి, సేవ్‌ అమరా వతి అంటూ నినాదాలు చేశారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో గ్రామస్థులు చేస్తోన్న నిరసనలు గురువారానికి 44వ రోజుకు చేరుకున్నాయి. 

Updated Date - 2020-06-05T09:14:20+05:30 IST