-
-
Home » Andhra Pradesh » Krishna » amaravati
-
295వ రోజుకు రాజధాని రైతుల నిరసనలు
ABN , First Publish Date - 2020-10-07T16:47:18+05:30 IST
రాజధాని కోసం రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 295వ రోజుకు చేరుకున్నాయి.

అమరావతి: రాజధాని కోసం రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 295వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది.