రైతు ముంగిటకు వ్యవసాయ ప్రయోగశాలలు
ABN , First Publish Date - 2020-05-29T09:08:19+05:30 IST
రైతుల ముంగిటకు వ్యవసాయ ప్రయోగశాలలు తీసుకువచ్చా మని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు.
మచిలీపట్నం టౌన్: రైతుల ముంగిటకు వ్యవసాయ ప్రయోగశాలలు తీసుకువచ్చా మని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్యార్డులో రూ.82లక్షలతో నిర్మిం చనున్న సమగ్ర ప్రయోగశాలకు గురువారం శంకుస్థాపన చేశారు. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల నాణ్యతను ప్రయోగశా లలో పరీక్షించిన తరువాతే రైతులు వినియోగించేలా చర్యలు తీసుకుంటా మన్నారు. మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ అచ్చాబా, వైస్ చైర్మన్ తోట సత్యనారాయణ, జేడీమోహనరావు, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఏవో నూరున్నీసా, డైరెక్టర్లు పాల్గొన్నారు.