34 మంది తహసీల్దార్లు బదిలీ
ABN , First Publish Date - 2020-09-14T08:46:00+05:30 IST
జిల్లావ్యాప్తంగా మొత్తం 34 మంది తహసీల్దార్లను బదిలీ చేశారు.
ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ ఇంతియాజ్
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): జిల్లావ్యాప్తంగా మొత్తం 34 మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. ఉయ్యూరు కేసీవో తహసీల్దార్గా పనిచేస్తున్న కె.నాగేశ్వరరావును ఉయ్యూరు మండల తహసీల్దార్గా బదిలీ చేశారు.భూక్యా ఆసయ్య (ముసునూరు, గంపలగూడెం)ను గంపలగూడెం, కె మైనర్బాబు (నూజివీడు కేఆర్ఆర్సీ)ను కృత్తివెన్ను, ఎం .మాధురి (విజయవాడ వెస్ట్ ఎఫ్ఏసీ)ని విజయవాడ వెస్ట్, కె.శ్రీనివాసరెడ్డి (సబ్ కలెక్టరేట్ ఏవో)ను సబ్కలెక్టరేట్ ఏవో, షకీరున్నీసాబేగం (పెనుగంచిప్రోలు ఎఫ్ఏసీ)ని పెనుగంచిప్రోలు, ఆర్ దుర్గాప్రసాద్ (తోట్లవల్లూరు)ను ఉంగుటూరు, కె.వెంకటశివయ్య (పమిడిముక్కల)ను తోట్లవల్లూరు, ఎం.పద్మకుమారి (మోపిదేవి)ని పమిడిముక్కల, సీహెచ్ నరసింగరావు (బాపులపాడు)ను గన్నవరం, బి.సాయుశ్రీనివాసనాయక్ (వీరులపాడు)ను విజయవాడ రూరల్, ఎం.వెంకటరామయ్య (నాగాయలంక)ను వీరులపాడు, జె.విమలకుమారి (గూడూరు)ను నాగాయలంక, డి.వనజాక్షి (విజయవాడ రూరల్)ను గూడూరు, పి.జయశ్రీ (విజయవాడ సెంట్రల్ ఎఫ్ఏసీ)ను విజయవాడ సెంట్రల్, షంసున్నీసా బేగం (గంపలగూడెం)ను కృష్ణా కలెక్టరేట్, కందుల శ్రీరాములు (విజయవాడ ఈస్ట్ డిటీ)ని కలెక్టరేట్ (పదోన్నతి), జి.విక్టర్బాబు (అవనిగడ్డ)ను కలెక్టరేట్, ఎ.జనార్దనరావు (చందర్లపాడు)ను కలెక్టరేట్, టి.చంద్రశేఖరనాయుడు (ఉయ్యూరు)ను కలెక్టరేట్, ఎం.హరనాథ్ (చెక్పోస్ట్)ను కలెక్టరేట్, కె.మస్తాన్ (అవనిగడ్డ)ను మోపిదేవికి, ఏఎస్ఎన్ రాధిక (స్టేట్ గెస్ట్ హౌస్)ను సబ్కలెక్టరేట్ కేఆర్ఆర్సీ, చందన దుర్గాప్రసాద్ (ఇబ్రహీంపట్నం డీటీ)ని విజయవాడ నార్త్ (పదోన్నతి), జె.సుశీలాదేవి (సివిల్ సప్లయిస్)ని చందర్లపాడు (పదోన్నతి), డి.కోటేశ్వరరావు (పెనుగంచిప్రోలు)ను బందరు టూరిజంకు, నారాయణ (విజయవాడ కేకేఆర్సీ)ని నూజివీడు కేకేఆర్సీ, సాయి కృష్ణకుమారి (ముడా)ని కైకలూరు, డి.వి.ఎస్.ఎల్లారావు (కలెక్టరేట్)ను విజయవాడ ఈస్ట్, సి.వాసుదేవ్ (విజయవాడ నార్త్)ను ఘంటసాల, భూక్యా శ్రీనునాయక్ (మండవల్లి)ని అవనిగడ్డ, శర్మ (నూజివీడు)ను కలిదిండి, ఎం.సూర్యారావు (కైకలూరు)ను ఇబ్రహీంపట్నం, వి.స్వామినాయుడు (కలిదిండి)ని గుడివాడ ఏవోగా బదిలీ చేశారు.