అగ్రవర్ణ పేదలు వైఎస్సార్ చేయూతకు అర్హులు కారా ?
ABN , First Publish Date - 2020-11-14T05:00:56+05:30 IST
వైఎస్ఆర్ చేయూత పథకం అగ్రవర్ణ పేద మహిళలకు వర్తిం చకపోవడం అన్యాయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.
వేంపల్లె, నవంబరు 13: వైఎస్ఆర్ చేయూత పథకం అగ్రవర్ణ పేద మహిళలకు వర్తిం చకపోవడం అన్యాయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం ప్రామాణికంగా పథకాన్ని అమలు చేస్తున్న ప్పుడు కులాల ప్రస్తావన తెచ్చి అగ్రకులాల పేదలను పక్కన పెట్టడం సమంజసం కాదన్నారు. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, రెడ్డి, కమ్మ, వెలమ, కాపు, బలిజ, తెలగ, ఒంటరి తదితర అగ్రకులాల్లో అనేకమంది మహిళలు కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారన్నారు. కుటుంబాలను పోషించుకోలేక, పిల్లలను చదివించుకోలేక పెళ్లిళ్లు చేయలేక జీవచ్చ వాల్లా బతుకుతున్నారన్నారు. విద్య, ఉద్యోగాల్లో 10శాతం ఈడబ్ల్యూఎస్ రిర్వేషన్లు కేటా యించగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. వైఎస్ఆర్ పెళ్లికానుక అగ్రవర్ణ పేద వధువులకు వర్తించడం లేదని కావున పథకాన్ని అమలు చేయాలన్నారు.