రూ.1.50 లక్షల విలువైన వెండి వస్తువులు స్వాధీనం

ABN , First Publish Date - 2020-11-22T04:42:07+05:30 IST

ఆర్టీసీ బస్టాండు వద్ద జరిగిన చోరీ కేసులో రూ.1.50 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందితు డిని అరెస్టు చేశామని బద్వే లు అర్బన సీఐ రమే్‌షబాబు తెలిపారు.

రూ.1.50 లక్షల విలువైన వెండి వస్తువులు స్వాధీనం
పోలీసులు స్వాధీనం చేసుకున్న వెండి ఆభరణాలు, నిందితుడితో సీఐ, ఎస్‌ఐ తదితరులు

బద్వేలు, నవంబరు 21: ఇటీవల ఆర్టీసీ బస్టాండు వద్ద జరిగిన చోరీ కేసులో రూ.1.50 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందితు డిని అరెస్టు చేశామని బద్వే లు అర్బన సీఐ రమే్‌షబాబు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ భగతసింగ్‌ కాలనీ వద్ద వాహన తనిఖీలో స్థాని క ఎగువ బ్రాహ్మణవీధి వాసి అలీ హుసేన వద్ద ఉన్న బ్యాగ్‌ను పరిశీలించారు. ఇందులో సుమారు 2.571 కిలోల వెండి ఆభరణాలు గుర్తించినట్లు ఆయన తెలిపారు. అయితే ఈ విషయమై విచారిస్తే ఈనెల 19న బద్వేలు ఆర్టీసీ బస్టాండు వద్ద కడప నుంచి వచ్చిన నెల్లూరు బస్సును అలీ హుసేన ఎక్కినట్లు వెల్లడించాడు. ఆ సమ యంలో బస్సు సీట్లో ఉన్న బ్యాగు తీసుకుని ఇంటికి వెళ్లినట్టు వివరించాడు. తర్వాత  బ్యాగులో ఉన్న వెండి వస్తువులను అమ్మేందుకు వెళుతుండగా తనిఖీలో దొరికినట్లు విచారణలో భాగంగా ఆయన అంగీకరించారన్నారు. దీంతో అతడి నుంచి రూ.1.50 లక్షలు విలువైన వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ  తెలిపారు. ఈ వెండి వస్తువులకు సంబంధించి ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఎవరైనా వెండి వస్తువులు పోగొట్టుకుని ఉంటే స్థానిక పోలీసుస్టేషనలో ఫిర్యాదు చేయాలని సీఐ తెలిపారు.

Updated Date - 2020-11-22T04:42:07+05:30 IST