ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోండి
ABN , First Publish Date - 2020-07-01T10:33:26+05:30 IST
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇసుక మాఫియా చెలరేగిపోతోందని, ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీకి తెగబడుతున్న అధికారులు
కడప (కలెక్టరేట్), జూన్ 30 : వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇసుక మాఫియా చెలరేగిపోతోందని, ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీకి తెగబడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు షేక్ నజీర్ అహమ్మద్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దొరకక భవన నిర్మాణ కార్మికులకు పనులు కూడా లేక ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. లాక్డౌన్ వల్ల పనులు లేక ఆర్థికంగా చితికిపోయారని ఇలాంటి వారికి ప్రభుత్వం అండగా ఉండి రూ.20 వేల ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, నాగరాజు, విజయభాస్కర్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.